For Money

Business News

ఐవీఆర్‌సీఎల్‌ను అమ్మేశారు

హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీని రూ.1200 కోట్లకు విక్రయించనున్నారు. ఈ కంపెనీని మూడోసారి వేలం వేసిన విషయం తెలిసిందే. గత నెలలో బిడ్లు ఆహ్వానించారు. కంపెనీ కొనుగోలుకు కనీసం రూ.1,200 కోట్లుగా నిర్ణయించారు. పొంగులేటి ప్రసాద్‌ రెడ్డి, ఇతరులతో కూడిన SPV బిడ్‌ను దాఖలు చేశారు. వీరు వేలానికి క్వాలిఫై అయ్యారు. ఈ నెల 15న జరిగిన ఈ-ఆక్షన్‌లో ఎవరూ బిడ్లను దాఖలు చేయలేదు. కనీస మొత్తం రూ.1,200 కోట్లు చెల్లించడానికి క్వాలిఫైడ్‌ బిడ్డర్‌ అంగీకరించినందున వారికే కంపెనీ విక్రయించేందుకు నిర్ణయించారు.