For Money

Business News

హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై ఐటీ దాడులు

ప్రముఖ పార్మా సంస్థ హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.  హైదరాబాద్‌లోని కంపెనీ ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు కంపెనీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను చేపట్టినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులకు గడువు పూర్తయిన వెంటనే ఈ దాడులు జరగడం విశేషం.