For Money

Business News

డోలో తయారీ కంపెనీపై ఐటీ దాడులు

పాపులర్ ఔషధం డోలో -650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20 మంది ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 40 చోట్ల 200 ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మాధవ్‌నగర్‌లోని రేస్‌కోర్స్‌ రోడ్డులో ఉన్న మైక్రో ల్యాబ్‌ కార్యాలయం నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.