For Money

Business News

హెటిరో డ్రగ్స్‌పై కొనసాగుతున్న దాడులు

ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో సహా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో నిన్న ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. హెటిరో డ్రగ్స్ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్లు సందీప్ రెడ్డి, నరసింహారెడ్డి, వంశీకృష్ణ, పార్థసారథిరెడ్డిలతో పాటు మరికొందరి ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.