For Money

Business News

దేశంలో ఐఎస్‌బీ.. టాప్‌

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలోని బిజినెస్‌ స్కూళ్లలో టాప్‌గా నిలిచింది. టాప్‌-100 ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఎగ్జిక్యూటీవ్‌ ఎంబీఏ 2022 ర్యాంకుల్లో భారత్‌లో ఐఎస్‌బీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో 44వ స్థానంలో ఉంది. ఐఎస్‌బీ తర్వాత దేశీయ రెండో అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్‌గా ఐఐఎం బెంగళూరు నిలిచింది. అంతర్జాతీయంగా తీసుకుంటే ఈ స్కూల్‌ ర్యాంక్‌ 67. ఎఫ్‌టీ సర్వేలో ఐఎస్‌బీ అత్యుత్తమంగా నిలవడం సంతోషకరమని, భవిష్యత్తులోనూ ఈ గుర్తింపునకు తగ్గట్టుగా తమ సంస్థ పనిచేస్తుందని ఐఎస్‌బీ అకాడమిక్‌ ప్రోగ్రామ్స్‌ డిప్యూటీ డీన్‌ ప్రొఫెసర్‌ రామభద్రన్‌ తిరుమలై అన్నారు.