For Money

Business News

ఐపీఎల్‌ టీవీ హక్కులు స్టార్‌కు

ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లను టీవీలో ప్రసారం చేస్తున్న డిస్నీ హాట్‌స్టార్‌ పక్కకు తప్పుకుంది. ఇటీవల జీటీవీని కొనుగోలు చేసిన స్టార్‌ ఇండియా ఐపీఎల్ భారతలో టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. ఇవాళ అన్ని విభాగాల బిడ్డింగ్‌ పూర్తయిన తరవాత విజేతల పేర్లను బీసీసీఐ కార్యదర్శి జయ్‌షా ట్వీట్‌ చేశారు. స్టార్‌ ఇండియా రూ. 23,758 కోట్లకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక డిజిటల్‌ మీడియా హక్కులను రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన వయకామ్‌ 18 దక్కించుకుంది. ఈ సంస్థ రూ. 23,758 కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసింది. అంటే టీవీలో ప్రసారాల కన్నా అధిక మొత్తాన్ని డిజిటల్‌ మీడియాలో ప్రసారానికి చెల్లించారన్నమాట. ఇక విదేశాల్లో ప్రసారాలకు సంబంధించి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌కు చెందిన హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకోగా, MENA, అమెరికా హక్కులు టైమ్స్‌ గ్రూప్‌ దక్కించుకుంది. 2023-27 వరకు మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ రూ.48,390 కోట్లు ఆర్జించింది.