For Money

Business News

డీజిల్‌పై లీటర్‌కు రూ.14 నష్టం

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో తాము పెట్రోల్‌ను లీటరుకు రూ.10 నష్టంతో, డీజిల్‌ను రూ.14 నష్టంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) అమ్మినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో ఐఓసీ రూ.1,992 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 5941 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పెట్రోల్‌, డీజిల్‌పై మార్జిన్‌ బాగా తగ్గడం వల్ల కంపెనీ భారీ నికర లాభాన్ని ఆర్జించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించడం వల్ల నిల్వలపై రూ.1500 కోట్ల నుంచి రూ. 1600 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొంది. ఇతర ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు ముడిధరలు పెరిగినా పెట్రోల్‌, డీజిల్‌లను మార్చలేదు. తాముకొనుగోలు చేసిన క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌కు 109 డాలర్లు పడిందని, అయితే 85 డాలర్లు లేదా 86 డాలర్ల లెక్కనఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మాయి.