For Money

Business News

రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా మృతి

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా మృతి (62) చెందారు. ఇవాళ ఉదయం 6.45 గంటలకు ఆయనను బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తీసుకు వచ్చారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన గత కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చారు.వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యతో ఆయన కొన్ని నెలల క్రితం హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. ట్రీట్‌మెంట్‌ తరవాత కొన్ని వారాల క్రితమే ఆయన డిశ్చార్జి అయ్యారు. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా ఉంటూ దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన సంపద దాదాపు రూ. 44,000 కోట్లు ఉంటుందని అంచనా.