For Money

Business News

జీ ఎంటర్‌టైన్మెంట్‌లో రేపు బ్లాక్‌ డీల్‌

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ నుంచి ఇన్వెస్కో పాక్షికంగా తన వాటా అమ్మనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో అతి పెద్ద ఇన్వెస్టర్‌ ఈ కంపెనీనే. ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌ ఎల్‌ఎల్‌సీతో కలిసి ఇన్వెస్కోకు జీలో 17.88 శాతం వాటా ఉంది. తన వాటాలో 7.8 శాతం వాటాను రేపు విక్రయించనుంది. అంటే 7.4 కోట్ల షేర్లను అమ్మనుంది. షేర్‌ ధర రూ. 270 నుంచి రూ. 290 మధ్య ఉంటుంది. అంటే ఈ బ్లాక్‌ డీల్‌ ద్వారా ఇన్వెస్కోకు రూ.2,200 కోట్లు అందనుంది. జీ కంపెనీ ఈజీఎం కోసం పట్టుబడుతూ కోర్టుకు ఎక్కిన ఇన్వెస్కో విజయం సాధించింది. అయితే ఈజీఎం కోసం పట్టుబట్టనని, అయితే సోనీ పిక్చర్‌తో జీ డీల్‌ ఎలా అమలవుతుందో పర్యవేక్షిస్తానని చెప్పింది.