For Money

Business News

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పెంపు

త్వరలోనే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీనికి సంకేతంగా ఎస్‌బీఐ ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రారంభ సూచకంగా రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.01 శాతం మేర వడ్డీ పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్‌ తెలిపింది. కొత్త డిపాజిట్‌లతో పాటు ప్రస్తుతం ఉన్న డిపాజిట్లకు కూడా వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. అలాగే రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.