For Money

Business News

CMS ఇన్ఫో ఐపీఓ రేపు ఓపెన్‌

సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రేపు అంటే 21వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ 23న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,100ల కోట్లను కంపెనీ సమీకరించనుంది. ఇష్యూ షేర్‌ శ్రేణి ధర రూ.205 – రూ. రూ. 216. ఒక లాట్‌కు 69 షేర్లు ఉంటాయి. గరిష్ఠంగా 13 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐపీవో తర్వాత ప్రమోటర్ల వాటా 65.59శాతానికి తగ్గనున్నాయి.2008లో ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏటీఎం క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా ఇది నిలిచింది. ఈ కంపెనీ గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,321 కోట్ల టర్నోవర్‌పై రూ.168 కోట్ల లాభాన్ని సంపాదించింది.ఈ షేరు ప్రస్తుతం అనధికార మార్కెట్‌లో రూ.30 ప్రీమియం పలుకుతోంది.