For Money

Business News

52 వారాల కనిష్ఠ స్థాయికి…

అమెరికా ఐటీ, టెక్‌ రంగంలో భారీ ఒత్తిడి వస్తోంది. అనేక కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. కరోనా సమయంలో అనూహ్య వ్యాల్యూయేషన్స్‌తో దూసుకుపోయిన నాస్‌డాక్‌లో ఇపుడు భారీ కరెక్షన్‌ వస్తోంది. ఈ ఏడాది నాస్‌డాక్‌ ఇప్పటి వరకు 28.28శాతం క్షీణించింది. ఇదే సమయంలో భారత్‌లో ఉన్న ఐటీ కంపెనీల్లో కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. అనేక షేర్ల వ్యాల్యూయేషన్‌ 30 శాతం పైగా తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. ఈ ఏడాది జనవరి 17న రూ.1953ని తాకిన ఈ షేర్‌ ఇవాళ రూ.1360ని తాకింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ.1369 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌లో డెలివరీ శాతం 62 శాతంపైన ఉంది. అయినా ఈ ధర వద్ద కొనేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఇక నంబర్‌ వన్‌ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌ కూడా 52 వారాల కనిష్ఠ ధరకు దగ్గర్లోనే ఉంది. ఈ షేర్‌ కూడా ఈ ఏడాది జవనరి 17న రూ.4043ని తాకింది. ఇవాళ రూ,. 2979ని తాకింది. ఈ షేర్‌ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 2953. అంటే మరో రూ.26 దూరంలో ఉందన్నమాట. చిత్రంగా ఇన్వెస్టర్ల నుంచి ఒక్కో షేర్‌ రూ. 4500లకు టీసీఎస్‌ కొనుగోలు చేసింది. అమ్మినవాడు అదృష్టవంతుడు.