For Money

Business News

15 నుంచి టూరిస్ట్‌ వీసాలు… కానీ

ఈనెల 15వ తేదీ నుంచి భారత్‌ సందర్శించేందుకు విదేశీ టూరిస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీరు చార్టెడ్‌ ఫ్లైట్స్‌లోనే రావాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ కమర్షియల్‌ విమానాల్లో రావాలనుకునే వారు నవంబర్‌ 15 వరకు ఆగాల్సిందే. అక్టోబర్‌ 15 నుంచి టూరిస్ట్‌ వీసాలు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించుకుని, విశ్లేషించిన కేంద్ర హోం శాఖ ఈనెల 15వ తేదీ నుంచి భారత్ సందర్శనకు వచ్చే టూరిస్టులకు వీసాలు ఇవ్వాలని నిర్ణయించింది. నెల రోజులు కేవలం చార్టెట్‌ విమానాలను మాత్రమే అనుమతించాలని, ఆ తరవాత సాధారణ విమానాల్లో వచ్చే వారికి కొత్తగా వీసాలు జారీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.