For Money

Business News

డ్రైవర్‌, పనిమనిషికి అదిరే గిఫ్ట్‌…

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథన్ సుమారు రూ.4.82 కోట్లకు పైగా విలువైన 11 లక్షల బ్యాంక్ షేర్లను తన వద్ద పనిచేస్తున్న సహాయకులు, ఓ స్వచ్ఛంధ సంస్థకు బహుమానంగా అందించారు. ఇవన్నీ వారు ఇంటి నిర్మాణం కోసం తాను ఇస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపారు. శిక్షకుడు రమేష్‌ రాజుకు 3 లక్షల షేర్లు, ఇంటి పని మనిషి ప్రంజల్ సర్వేకర్‌కు 2 లక్షలు, డ్రైవర్‌ ఆల్గర్‌ సామి సి మునాపర్‌కు 2 లక్షల షేర్లు బహుమతిగా ఇచ్చారు. అలాగే ఆఫీసు పనిలో సాయం చేసే దీపక్ పథారేకు లక్ష షేర్లు, ఇంటి పనిమనిషి సంతోష్ జోగ్లేకు లక్ష షేర్లు బహుమానంగా అందించినట్లు ఆయన ఎక్స్ఛేంజీలకు తెలిపారు.మరో రెండు లక్షల షేర్లను రుక్మిణి వేల్ఫేర్‌ ట్రస్ట్‌ కోసం డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. బీఎస్ఈలో ఈ షేర్‌ నిన్న రూ.43.90 వద్ద ముగిసింది. ఈ లెక్కన ఈ 11 లక్షల షేర్ల విలువ రూ.4,82,90,000.