For Money

Business News

దుమ్మురేపుతున్న సుగర్‌ షేర్లు

చక్కెర రంగానికి చెందిన షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఇవాళ మార్కెట్‌ స్థిరంగా ఉంది. నిఫ్టి స్వల్ప నష్టాల్లో ఉంది. అయినా సుగర్‌ షేర్లు పది శాతం నుంచి 20 శాతం మేర పెరిగాయి. కేసీపీ ఇంజినీరింగ్‌ షేర్‌ కూడా 5 శాతంపైగా పెరిగింది. సుగర్‌ డివిజన్‌ ఉన్న ప్రతి షేర్‌ గ్రీన్‌ ఉంది. వంద శాతం సుగర్‌ షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శక్తి సుగర్‌,సిభోలి సుగర్స్‌,రాజశ్రీ సుగర్స్‌, ఉగర్‌ సుగర్స్, బజాజ్‌ హిందుస్థాన్‌తో పాటు దాల్మియా షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. చాలా మంది అనలిస్టులు దాల్మియా భారత్‌ షేర్‌ రూ. 367 నుంచి ఏకంగా రూ. 440ని తాకింది. శ్రీరేణుక సుగర్స్‌ రూ.66 టార్గెట్‌గా అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు.