For Money

Business News

10 నుంచి విదా ఈవీ స్కూటర్‌ బుకింగ్స్

హీరో మోటోకార్ప్‌ విదా పేరుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీ నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. ఇపుడు బుక్‌ చేసుకున్నవారికి డిసెంబర్‌ రెండోవారం నుంచి వాహనాల డెలివరీ ఉంటుంది. విదా V1 ప్లస్‌ వాహనం ధర రూ. 1.45 లక్షలు కాగా, విదా V1 ప్రొ మోడల్ ధర రూ. 1.59 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఈ వాహనాలు తొలుత ఢిల్లీ, జైపూర్, బెంగళూరు నగరాల్లో మాత్రమే లభ్యమౌతాయి. ఎకో, రైడ్‌, స్పోర్ట్స్‌ మోడల్‌లో ఈ వాహనాలు లభిస్తాయి. ఈ వెహికల్స్ టాప్‌ స్పీడ్‌ గంటకు 80 కి.మీ. 3.2 సెకన్లలో స్కూటర్‌ 40 కి.మీ. స్పీడ్‌ను అందుకుంటుంది.