For Money

Business News

హీరో బైక్స్‌ ధరలు పెంపు

ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో మోటో కార్ప్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. దాదాపు అన్ని శ్రేణుల బైక్‌ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. ఈ పెంపుదల రూ. 1500 దాకా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త ధరలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. గత జులైలో కంపెనీ బైక్‌ ధరలు రూ.3628 దాకా పెంచిన విషయం తెలిసిందే.