For Money

Business News

స్వల్పంగా పెరిగిన జీఎస్టీ వసూళ్ళు

అక్టోబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ. 1.52 లక్షల కోట్లకు చేరాయి. గత నెలలో అంటే సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్ళు రూ. 1.48 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ.25300 కోట్ల నుంచి రూ. 26000 కోట్లకు పెరిగింది. అలాగే స్టేట్‌ జీఎస్టీ వసూళ్ళు రూ. 31800 కోట్ల నుంచి రూ. 33400 కోట్లకు చేరాయి. ఇక ఇంటెగ్రేటెడ్‌ జీఎస్టీ వసూళ్లు రూ. 80,500 కోట్ల నుంచి రూ. 81,800 కోట్లకు పెరిగాయి. జీఎస్టీ సెస్‌ వసూళ్ళు రూ. 10100 కోట్ల నుంచి రూ. 10500 కోట్లకు చేరాయి.