For Money

Business News

నేషనల్‌ ల్యాండ్‌ మానెటైజేషన్‌ కార్పొరేషన్‌ వస్తోంది

బడ్జెట్‌లో ప్రతిపాదించిన నేషనల్‌ ల్యాండ్‌ మానెటైజేషన్‌ కార్పొరేషన్‌ (NLMC)ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూమిని తీసుకుని వాటిని ఈ కార్పొరేషన్‌ మానెటైజ్‌ చేస్తుంది. అమ్మకం అనే పదం వాడకున్నా.. ప్రైవేట్‌ కంపెనీలకు 60 నుంచి 80 ఏళ్ళ వరకు లీజుకు ఇవ్వడమంటే… దాదాపు అమ్మేసినట్లే భావించాలి. లీజుకు లేదా అద్దెకు లేదా మరో మానెటైజేషన్‌ పద్ధతిలో ఈ భూములు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. NLMCని రూ. 5000 కోట్ల ఆధీకృత మూలధనంతో రూ. 150 కోట్ల సబ్‌స్క్రయిబ్డ్‌ క్యాపిటల్‌తో ప్రారంభిస్తారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న 3500 ఎకరాలను ఈ కార్పొరేషన్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన కేబినెట్‌ నోట్‌ను ఆర్థిక శాఖ రెడీ చేసింది. త్వరలోనే కేబినెట్‌ ముందు పెట్టనున్నారు.