For Money

Business News

ప్రభుత్వం యూటర్న్‌… 20% కోలుకున్న IRCTC

ఇవాళ దాదాపు 25 శాతం నష్టపోయిన ఐఆర్‌సీటీసీ షేర్‌ ఇపుడు కోలుకుంది. ప్రయాణీకుల నుంచి వసూలు చేసే కన్వేయన్స్‌ ఫీజులో 50 శాతం తమకు ఇవ్వాలని ఐఆర్‌సీటీసీకి ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయం బయటపడగానే కంపెనీ షేర్‌ 25 శాతం క్షీణించింది. దీంతో ఇవాళ ఉదయం ఐఆర్‌సీటీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌తో ప్రభుత్వం మాట్లాడింది. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో షేర్‌ 20 శాతం కోలుకుంది. ఇంకా 5 శాతం నష్టంతో షేర్‌ ట్రేడవుతోంది.