For Money

Business News

ఢిల్లీ హైకోర్టుకు గూగుల్‌

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)పై ఢిల్లీ హైకోర్టులో గూగుల్‌ కేసు పెట్టింది. రహస్య నివేదికలను సీసీఐ డైరెక్టర్ జనరల్ మీడియాకు లీక్‌ చేశారని… దీనివల్ల తనకే కాకుండా తన క్లయింట్లకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. ఒకవైపు దర్యాప్తు నడుస్తుండగా రహస్య నివేదికలను సీసీఐ ఎలా మీడియాకు లీక్‌ చేస్తుందని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లపై గూగుల్‌ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని సీసీఐ డైరెక్టర్‌ జనరల్ ఓ నివేదిక సిద్ధం చేశారు. కేసు విచారణ జరుగుతోంది. ఈలోగా రహస్యంగా ఉండాల్సిన నివేదికను సీసీఐ మీడియాకు లీక్‌ చేసిందని గూగుల్‌ పేర్కొంది. దర్యాప్తు సమయంలో తాము సీసీఐకు పూర్తిగా సహకరించామని, ఇదే సమయంలో సీసీఐ కూడా అదే స్థాయి విశ్వసనీయ చూపుతుందని భావించామని ఆరోపించింది.