For Money

Business News

మెరిసిన బులియన్‌

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పాటు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. రెండు ఒకేసారి పెరగడం వల్ల మనదేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లకంటే అధికంగా పెరుగుతున్నాయి. ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ విషయానికొస్తే ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 469 పెరిగి రూ. 49,583కి చేరింది. ఇది ఏప్రిల్ నెల కాంట్రాక్ట్‌. ఇక వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ రూ. 834 పెరిగి రూ. 63,822లకు పెరిగింది.