For Money

Business News

18 నుంచి మళ్ళీ గోల్డ్‌ బాండ్స్‌

మరోసారి సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల18న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్‌ అయిదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాముకు ధరను రూ.6199గా ఆర్‌బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న మూడో సిరీస్‌ ఇది. ఈ ఏడాది జూన్‌లో ఒకసారి, సెప్టెంబర్‌లో రెండో విడత బాండ్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఉంటుంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయొచ్చు. ఒక ఏడాదిలో. ట్రస్టులైతే 20 కేజీల వరకు కొనొచ్చు. ఈ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. అలాగే నిర్ణీత వడ్డీ కూడా ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కావాలంటే వైదొలగొచ్చు.