రూ. 15,000 కోట్ల జాయింట్ వెంచర్స్
లోధా గ్రూప్ రూ.15,000 కోట్ల విలువైన జాయింట్ వెంచర్స్ను ఈ ఆర్థిక సంవత్సరంలో కుదుర్చుకోనున్నట్లు వెల్లడిచింది. ఈ గ్రూప్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ పేరుతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 51 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటి విలువ రూ.6200 కోట్లుగా పేర్కొంది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అద్భుత ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 190 శాతం పెరిగి రూ. 355 కోట్లకు చేరినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అభిషేక్ లోధా తెలిపారు. ఈ మూడు నెలల్లో ప్రి సేల్స్ కూడా 194 శాతం పెరిగి రూ. 2814 కోట్లకు చేరిందని అన్నారు. కలెక్షన్స్ 53 శాతం పెరిగి రూ. 2616 కోట్లకు, రెవెన్యూ 67 శాతం పెరిగి రూ. 2676 కోట్లకు చేరినట్లు అభిషేక్ లోధా వెల్లడించారు. ఇదే త్రైమాసికంలో రూ. 450 కోట్ల రుణాలను తగ్గించుకున్నామని.. ఇపుడు కంపెనీ రూ. 8856 కోట్లేనని తెలిపారు.