For Money

Business News

మరో హైదరాబాద్‌ కంపెనీ ఆస్తులు జప్తు

హైదరాబాద్‌కు చెందిన పీసీహెచ్‌ గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన 11 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఈ ఆస్తుల విలువ రూ. 6.18 కోట్ల. బ్యాంకులకు సుమారు రూ. 370 కోట్లు ముంచినందుకు ఈ కంపెనీ ఛైర్మన్‌ బల్విందర్‌ సింగ్‌ను గత ఫిబ్రవరిలో ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.ఈయనపై సీబీఐ చెన్నై బ్రాంచ్‌ కేసు నమోదు చేసి విచారిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సొంత అవసరాలను వాడుకోవడంతో పాటు గ్రూప్‌ కంపెనీలకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది.