For Money

Business News

దొడ్ల డెయిరీ చేతికి శ్రీ కృష్ణ మిల్క్స్‌

వ్యాపార విస్తరణలో భాగంగా దొడ్ల డెయిరీ శ్రీ కృష్ణ మిల్క్స్‌ను రూ. 50 కోట్లకు టేకోవర్‌ చేయనుంది. ఇది పూర్తిగా నగదు డీల్‌. శ్రీ కృష్ణ మిల్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, రెండు నెలల్లో టేకోవర్‌ ప్రక్రియ ముగుస్తుందని దొడ్ల డెయిరీ తెలిపింది. కర్ణాటకలో తొలి ప్రైవేట్‌ కంపెనీ డెయిరీ అయిన శ్రీ కృష్ణ మిల్క్స్‌ హుబ్లి కేంద్రంగా పనిచేస్తోంది. 1989లో ఏర్పాటైన ఈ కంపెనీ పాల సేకరణ, ఉత్పత్తి, డెయిరీ ఉత్పత్తుల విక్రయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.67.27 కోట్ల టర్నోవర్‌ సాధించింది. డొడ్ల డెయిరీ గురువారం బీఎస్‌ఈలో రూ.459.60 వద్ద ముగిసింది.