For Money

Business News

హైదరాబాద్‌ డిస్టిలరీపై ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. గత నెల 20వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ… ఢిల్ల్లీ మంత్రి మనిష్‌ సిసోడియాతో పాటు మరికొందరి ఆఫీసులు, ఇళ్ళపై దాడులు నిర్వహించింది. దానికి కొనసాగింపుగా ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోని రాబిన్ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీపై దాడులు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న రామచంద్రన్ పిళ్లై, బోయిన్‌పల్లి అభిషేక్‌లు నెలకొల్పారు. మద్యం స్కామ్‌ గత ఏడాది జరగ్గా… ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఏర్పడిన ఈ కంపెనీకి ఉన్న లింకుల గురించి ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆఫీసులు, ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్‌సాగర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.