For Money

Business News

డీసీఎక్స్‌ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

కేబుల్స్‌, వైర్‌ హార్నెస్‌ అసెంబ్లీస్‌ తయారు చేసే డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 31వ తేదీన పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 2న ముగియనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ధరల శ్రేణిని రూ.197 – రూ. 207గా ఖరారు చేశారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ నుంచి కంపెనీ రూ. 500 కోట్లను సమీకరించనుంది. రూ.100 కోట్ల విలువైన షేర్లను ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ప్రమోటర్లు అమ్ముకుంటున్నారు. మిగిలిన రూ. 400 కోట్లు కొత్తగా జారీ చేస్తున్నవే. రుణాలను తిరిగి చెల్లించడం, అదనపు వర్కింగ్‌ క్యాపిట్‌, అనుబంధ సంస్థ రానీల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో పెట్టుబడికి ఇప్యూ నిధులను వెచ్చించనున్నారు.