For Money

Business News

సైయెంట్‌ 5జీ సెంటర్‌

హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్‌..5జీ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీవోఈ)ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌(ఐఐటీ-హైదరాబాద్‌)తో కలిసి ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 5జీకి సంబంధించి ఐఐటీ-హైదరాబాద్‌ అభివృద్ధి చేసిన డిజిటల్‌ సేవలపై ఈ సెంటర్‌లో మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. అలాగే నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్లకు సాంకేతిక సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ వెల్లడించింది.