For Money

Business News

సైయెంట్‌ లాభంలో 38% వృద్ధి

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్‌ రూ.131.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం లాభం కంపెనీ ఆర్జించిన రూ.95.4 కోట్లతో పోలిస్తే ఇది 38 శాతం అధికమని సైయెంట్‌ ఎండీ, సీఈఓ కృష్ణ బోదనపు తెలిపారు. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1,066.2 కోట్ల నుంచి రూ.1,205.5 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు రూ.3,416 కోట్ల ఆదాయంపై రూ.368 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించిందని కృష్ణ అన్నారు. కంపెనీ వద్ద రూ.1,477 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలు ఉన్నాయని తెలిపారు.