ఈ చిన్న షేర్ కొనండి
మార్కెట్లో కాస్త ఫండమెంటల్స్ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లు అత్యధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. కాస్త రీజనబుల్ రేట్ల వద్ద లభిస్తున్న షేర్లు కరోనా సమయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగాలలో ఉన్నాయి. వాటిలో హోటల్స్ ఒకటి. ఇపుడు ఈ రంగం బాగా రాణిస్తోంది. ఈ రంగానికి చెందిన లెమన్ ట్రీ షేర్ను కొనుగోలు చేయాలని సీఎల్ఎస్ఏ సిఫారసు చేస్తోంది. ఈ షేర్ ధర గత మూడు నెలలుగా రూ. 62 నుంచి రూ. 66 మధ్య కదలాడుతోంది. ఈ షేర్ను రూ. 80 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చని ఈ సంస్థ అంటోంది. ఈ కంపెనీ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో డబుల్ అవుతుందని సీఎల్ఎస్ఏ అంటోంది. ఆక్యుపెన్సీతోపాటు ఏఆర్ఆర్ల రికవరీ విషయంలో ఈ సంస్థ చాలా పాజిటివ్గా ఉంది. కార్పొరేట్ డిమాండ్ పెరుగుతున్నందున కంపెనీ విస్తరణకు వెళుతోంది. ప్రస్తుతం ఈ షేర్ డిస్కౌంట్కు లభిస్తోందని సీఎల్ఎస్ఏ పేర్కొంది.