For Money

Business News

రిలయన్స్‌… కొనండి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా రెండు ప్రధాన బ్రోకింగ్‌ సంస్థలు రెకమెండ్‌ చేశాయి. ప్రధానంగా సీఎల్‌ఎస్‌ఏ రిలయన్స్‌ టార్గెట్‌ ధర రూ. 3180గా పేర్కొనడం. కంపెనీ 2023-24 ఏడాదికి ఈపీఎస్‌ను 3 నుంచి 4 శాతం తగ్గుతుందని అంచనా వేసినా.. షేర్‌ ధర పెరుగుతుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. కంపెనీ క్యాష్‌ ఫ్లో బాగుంటుందని తెలిపింది. అలాగే రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటీలో కూడా కాస్త పెరుగుదల ఉంటుందని పేర్కొంది. అలాగే హెచ్‌ఎస్‌బీసీ కూడా రిలయన్స్‌ షేర్‌ను కొనసాగించాల్సిందిగా చేయాల్సిందిగా సిఫారసు చేసింది. అయితే టార్గెట్ ధరను రూ 2620గా పేర్కొంది. కొత్త ఎనర్జి బిజినెస్‌ కోసం కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది.