For Money

Business News

టాటా సన్స్ పగ్గాలు మళ్ళీ చంద్రశేఖరన్‌కే

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మళ్ళీ ఎన్‌ చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. బాంబే హౌస్‌లో ఇవాళ భేటీ అయిన టాటా సన్స్‌ గవర్నింగ్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం అయిదేళ్ళ పాటు అమల్లో ఉంటుంది. టాటా సన్స్‌ బోర్డులోని టాటా ట్రస్టీల బోర్డులు కూడా పాల్గొని, ఆమోదం తెలిపాయి. ఇవాళ్టి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా రతన్ టాటా కూడా హాజరయ్యారని, ఆయన చంద్రశేఖరన్‌ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారని టాటా సన్స్‌ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ చేసిన కృషిని బోర్డు అభినందించింది. మరో అయిదేళ్ళ పాటు తనను ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించినందుకు చంద్రశేఖరన్‌ కృతజ్ఞతలు తెలిపారు. టాటా గ్రూప్‌ కంపెనీలన్నీ టాటా సన్స్‌ ఆధీనంలో ఉంటాయి.