For Money

Business News

బడ్జెట్‌ ఫిబ్రవరి 1న

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ (2022-23)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు. ఈ సమావేశాల తొలి విడత ఫిబ్రవరి 11 వరకు కొనసాగనున్నాయి. రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో అన్ని రకాల ముందు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. ఇటీవల 400 మంది పార్లమెంటుసిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.