For Money

Business News

MTNLలో BSNL విలీనానికి రంగం సిద్ధం

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (NTNL)తో పాటు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (BBL) ఒకే టెలికాం కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ మూడు సంస్థలను విలీనం చేయాలని టెలికమ్యూనికేషన్స్‌ విభాగం కేబినెట్‌కు ఓ నోట్‌ పంపినట్లు ఈనెల 23వ తేదీన ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కోసం రూ. 44,720 కోట్లు కేటాయించేందుకు బడ్జెట్‌ ప్రతిపాదనలు పెట్టిన విషయం తెలిసిందే. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ల రుణ భారం రూ. 59588 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలను ప్రభుత్వం విలీనం చేస్తుందని ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ కూడా వెల్లడించారు. ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.
విలీనం చేయొద్దు
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. తమ సంస్థను ఎంటీఎన్‌ఎల్‌లో విలీనం చేయొద్దని ప్రధాన మంత్రికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. అలా చేయడం వల్ల కోలుకోలేని విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ దెబ్బతింటుందని యూనియన్ పేర్కొంది. ఈ మేరకు BSNLEU ప్రధాన కార్యదర్శి అభిమన్యూ ఈనెల 23న లేఖ రాశారు.