For Money

Business News

యాక్సిస్‌ బ్యాంక్‌లో బ్లాక్‌ డీల్‌

యాక్సిస్‌ బ్యాంక్‌లో తనకు ఉన్న వాటాను ప్రభుత్వం ఇవాళ అమ్మనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద తనకు ఉన్న 1.55 శాతం వాటా అంటే 4.65 కోట్ల షేర్లను ప్రభుత్వం అమ్మనుంది. స్పెసిఫైడ్‌ అండర్‌ టేకింగ్‌ ఆఫ్‌ ద యూనిట్‌ ట్రాస్ట్‌ ఆఫ్‌ ఇండియా (SUUTI) ద్వారా ప్రభుత్వానికి యాక్సిస్‌ బ్యాంక్‌లో 1.55 శాతం వాటా ఉంది. ఇవాళ యాక్సిస్‌ బ్యాంక్‌ ఇవాళ 830.63 కనీస ధరతో అమ్మనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఇవాళ, రేపు కూడా ఉండనుంది. దీనికి వచ్చే స్పందన బట్టి షేర్‌ ధరలో మార్పు ఉండనుంది. మంచి స్పందన లభిస్తే… షేర్‌ ధరలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. లేకుంటా నష్టాల్లోకి జారుకోవచ్చు. దిగువస్థాయిలో షేర్‌ను కొనే అవకాశమున్నా… ఇన్వెస్టర్లు స్టాప్‌ లాస్‌తో కొనాలని అనలిస్టులు అంటున్నారు.