For Money

Business News

25న ఏపీ బంగారు గనుల వేలం

ఆంధ్రప్రదేశ్‌, యూపీలోని మొత్తం 13 బ్లాకుల బంగారు గనులను ఈనెలలో కేంద్రం వేలం వేయనుంది. ఇందులో 10 బ్లాకుల బంగారు గనులు ఏపీకి సంబంధించినవి కావడం విశేషం. వీటికి సంబంధించిన వేల ప్రక్రియ టెండరు మార్చి నెలలోనే విడుదల అయింది. ఈనెల 26న ఏపీలోని అయిదు బ్లాకులను వేలం వేస్తారు. మిగిలిన బ్లాకులను ఈనెల 29వ తేదీన వేలం వేస్తారు. ఏపీలో కేంద్రం వేలం వేయనున్న బంగారు బ్లాకులు: రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొక్కసం పల్లి నార్త్‌ బ్లాక్‌, బొక్కసం పల్లి సౌత్‌ బ్లాక్‌, జావకుల -ఏ బ్లాక్‌, జావకుల -బిబ్లాక్‌, జావకుల – సి బ్లాక్‌, జావకుల – డి బ్లాక్‌, జావకుల -ఈ బ్లాక్‌, జావకుల- ఎఫ్‌ బ్లాక్‌. యూపీకి సంబంధించిన మూడు బంగారు గనుల వేలం కూడా ఈనెలలోనే జరుగుతుంది.కాని ఇంకా కచ్చిత తేదీ మాత్రం ప్రకటించలేదు.