For Money

Business News

జగన్‌ సర్కారుకు చుక్కెదురు

అమరరాజా బ్యాటరీస్‌ కేసుకు సంబంధించిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఫిబ్రవరిలో జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించింది. నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ …అమరరాజా యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ కొనసాగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.