For Money

Business News

500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో చోటు!

ప్రపంచంలోని 500 అత్యుత్త యాజమాన్యాలలో అమరరాజా కూడా ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ట్వీట్ చేసింది. ఫోర్బ్స్‌ 500 జాబితాలో అమరరాజాకు స్థానం దక్కినట్లు పేర్కొంది. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ గ్రూప్‌ కార్యక‌లాపాలు నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉద్యోగుల విలువ తెలిస్తే ఇతరులతో పోలిస్తే మనం కాస్త ముందుంటామన్న విష‌యాన్ని తాము విశ్వసిస్తామని కంపెనీ పేర్కొంది. ఆ విశ్వాసానికి నమ్మకం, గౌర‌వం అత్యంత కీలకం. ఆ విశ్వాసం ఉంటేనే మనం కలిసి మ‌రింత ముందుకు సాగుతామని అమరరాజా సంస్థ పేర్కొంది.