మైహోం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం
‘మై హోమ్ సయూక్’ పేరుతో మైహోమ్ గ్రూప్ నిర్మిస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టును నటుడు అల్లు అర్జున్ ప్రారంభించారు. నాలెడ్జ్సిటీలో గోపనపల్లి నుంచి తెల్లాపూర్ రోడ్డులో మై హోమ్, ప్రతిమ గ్రూప్ సంయుక్తంగా ‘మైహోమ్ సయూక్’ పేరుతో ఈ భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ… మై హోమ్ సంస్థ 35 సంవత్సరాల నుంచి ఈ రంగంలో రాణిస్తోందని అన్నారు. 3780 ఫ్లాట్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, మైహోం ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టు అద్భుతమని ఆయన అన్నారు. 25.37 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో జీ ప్లస్ 39 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందులో 12 టవర్లు ఉంటాయి. హైదరాబాద్లో నిర్మిస్తున్న ప్రీమియం ప్రాజెక్టులో ఇదే అతి పెద్ద ప్రాజెక్టు. మై హోమ్ సంస్థపైన కస్టమర్లకు ఎంతో నమ్మకం ఉన్నదని, సయూక్కి సంబంధించి అప్పుడే వెయ్యి ఫ్లాట్స్ బుక్ కావడం ఇందుకు నిదర్శనంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు మాట్లాడుతూ.. తెల్లాపూర్లో అద్భుతమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 6 టవర్లకు బుకింగ్స్ ప్రారంభించామన్నారు. 82 శాతం ఓపెన్ ఏరియాను కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ చొప్పున 2, 2.5, 3 బీహెచ్కేలు ఉంటాయన్నారు. ప్రీమియం లైఫ్స్టెల్ ఫ్లాట్ 1,355 చదరపు అడుగుల నుంచి 2,262 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుందని తెలిపారు. సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాల్లో కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.