అంతా అదానీమయం
షేర్ మార్కెట్ అంటే చాలా మంది భయం రిస్క్ ఎక్కువ అని. కాని అదానీ ఇన్వెస్టర్లకు ఆ భయం అక్కర్లేదు. కంపెనీ ఏం చేస్తుందో కూడా చూడాల్సిన పనిలేదు. కంపెనీ పేరు ముందు అదానీ ఉంటే చాలు. బహుశా ఇపుడు ప్రపంచ కోటీశ్వరుల్లో నంబర్ 5లో ఉన్న గౌతమ్ అదానీ నంబర్ వన్ స్థానంపై కన్నేసినట్లు ఉన్నారు. ఆయన గ్రూప్నకు చెందిన షేర్ల ధరలు పరుగులు చూస్తుంటే.. ఆయన నంబర్ వన్ అయినా.. పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా రూ. 227వద్ద లిస్టయిన అదానీ విల్మర్ షేర్ రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే రూ.803కు చేరింది. ఇవాళ కూడా ఆ కౌంటర్లో అమ్మకందారులు లేరు. అప్పర్ సర్క్యూట్తో ముగిసింది. అదే వ్యాపారం. అదే కంపెనీ మరి షేర్ ఎందుకు పెరుగుతోందో ఎవరీ అర్థం కావడం లేదు. కంపెనీ పనితీరు చూసి కాదు.. పేరు చూసి షేర్లు పెరగడం ఇపుడు తాజా ట్రెండ్లా కన్పిస్తోంది. ఇవాళ అదానీ గ్రూప్ షేర్ల జోరు ఇది
అదానీ పోర్ట్స్ – 6.14 శాతం
అదానీ ట్రాన్స్మిషన్ -9.48 శాతం
అదానీ గ్రీన్ ఎనర్జీ -5 శాతం
అదానీ ఎంటర్ప్రైజెస్ -4.81 శాతం
అదానీ పవర్ – 5 శాతం
అదానీ టోటల్ – 6 శాతం
అదానీ విల్మార్ -5 శాతం