For Money

Business News

అజంతా సోయా షేర్ల విభజన

వంటనూనెల తయారీ సంస్థ అజంతా సోయా లిమిటెడ్ తన షేర్లను 5:1 నిష్పత్తిలో విభజించాలని నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్ల వద్ద ఉన్న ప్రతి ఒక షేరుకు విభజన తరవాత అయిదు షేర్లు కేటాయిస్తారు. షేర్‌ విభజనకు రికార్డ్ తేదీని కంపెనీ త్వరలో నిర్ణయిస్తుంది. సాధారణంగా బోర్డ్ ఆమోదం పొందిన తరవాత 2 నెలలు షేర్ల విభజన ప్రక్రియ పూర్తి చేస్తారు. నిన్నీ షేర్‌ BSEలో దాదాపు ఫ్లాట్‌గా రూ. 246.70 వద్ద ముగిసింది.