For Money

Business News

ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీ

టాటా గ్రూప్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ అయిన ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించారు. ఈ మేరకు కంపెనీ యజమాని టాటా స‌న్స్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా సంస్థను గ‌త ఏడాది టాటా గ్రూపు టేకోవ‌ర్ చేసింది. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ గ్రూపులో 15 ఏళ్ళు విల్సన్ ప‌ని చేశారు. జ‌పాన్‌, కెన‌డా, హాంగ్‌కాంగ్ దేశాల్లో కూడా ఆయ‌న ప‌నిచేశారు. 1996లో ఎస్ఐఏలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. టాటా గ్రూపున‌కు చెందిన విస్తారాకు ఎస్ఐఏ భాగ‌స్వామిగా ఉన్న విషయం తెలిసిందే. సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన స్కూట్‌లో కూడా విల్సన్‌ సీఈవోగా చేశారు.