For Money

Business News

లిస్టింగ్‌… ఏజీఎస్‌కు 5 శాతం నష్టం

మార్కెట్‌ ఊహించినట్లే ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ షేర్ల లిస్టింగ్‌ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఒక్కో షేర్‌ను ఈ కంపెనీ రూ. 175లకు కేటాయించింది. ఇవాళ రూ.176 వద్ద లిస్టయిన కంపెనీ షేర్‌ రూ.181.85ని తాకిందో లేదో… అమ్మకాల ఒత్తిడి ప్రారంభమైంది. ఇపుడు ఈ షేర్‌ 5 శాతం నష్టంతో రూ. 166.10 వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ చాలా ఉత్సాహంగా ఉన్న కనీసం లిస్టింగ్‌ ధర వద్ద ఈ షేర్‌ నిలబడకపోవడం విశేషం. నిఫ్టి 280 పాయింట్ల లాభంతో 17,382 వద్ద ట్రేడవుతోంది.