For Money

Business News

కొనసాగుతున్న అదానీ షేర్ల జోరు

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల హవా కొనసాగుతోంది. పలు కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 1,580), అదానీ టోటల్ గ్యాస్(రూ. 1,447), అదానీ పవర్ (రూ. 98.50) ఐదు శాతం అప్పర్ సీలింగ్‌లో క్లోజయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 5 శాతం పెరిగి రూ. 1,589.80 వద్ద, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) మూడు శాతం పెరిగి రూ . 747.75 వద్ద ముగిశాయి. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రం రూ. 1,065 వద్ద ఫ్లాట్‌గా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్‌ మినహా మిగిలిన నాలుగు స్టాక్స్ ప్రస్తుతం బీఎస్‌ఈలో టి గ్రూప్ కింద ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ పవర్‌ స్టాక్స్‌ ర్యాలీ కొనసాగుతోంది. అదానీ ట్రాన్స్‌మిషన్ గడిచిన ఒక నెలలోనే 75 శాతం పెరిగింది.