For Money

Business News

డైరెక్టర్‌గా ఆదిత్య పూరీ?!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీగా ప‌ని చేసి రిటైర్‌ అయిన ఆదిత్య పూరీ త్వర‌లో `ఎస్‌`బ్యాంక్ డైరెక్టర్‌గా నియ‌మితులు అవుతారని వార్తలు వస్తున్నాయి. కార్ల్యేల్ గ్రూప్ సీనియ‌ర్ అడ్వైజ‌ర్‌ ఆదిత్య పూరీ ఇపుడు ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌ల `ఎస్` బ్యాంక్‌లో కార్ల్యేల్ గ్రూప్ గత వారం వాటా కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కంపెనీ తరఫున `ఎస్` బ్యాంక్‌లో డైరెక్ట‌ర్‌గా ఆదిత్య పూరీని కార్ల్యేల్ గ్రూప్ నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి.
కార్ల్యేల్ గ్రూప్‌తోపాటు యెస్ బ్యాంక్‌లో వాటా కొన్న మరో కంపెనీ అడ్వెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ త‌ర‌ఫున ఆ సంస్థ మేనేజింగ్ పార్టన‌ర్ శ్వేతా జ‌లాన్ నియమితులు కానున్నారు.