For Money

Business News

నికర లాభంలో 16 శాతం వృద్ధి

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మర్‌ ఒక మోస్తరు పనితీరు కనబర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 15,438 కోట్ల టర్నోవర్‌పై రూ. 246 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 14,370 కోట్ల టర్నోవర్‌పై రూ. 211 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏడాది కాలంలో కంపెనీ టర్నోవర్‌ 7 శాతం పెరగ్గా, నికర లాభం 16 శాతం పెరిగిందని అదానీ విల్మర్‌ వెల్లడించింది. వంటనూనెల విభాగంలో వ్యాపార పరిమాణం 26 శాతం పెరగ్గా, ఫుడ్‌ అండ్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగం టరనోవర్‌ 45 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది.