For Money

Business News

మీడియా బిజినెస్‌లోకి అదానీ

గత కొంత కాలం నుంచి అదానీ గ్రూప్‌ మీడియాలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇపుడు అంబానీ, అదానీలు దేశంలో నంబర్‌ వన్‌ స్థానం కోసం మ్యూజికల్‌ ఛైర్‌ నడుస్తోంది. దేశంలో అతి పెద్ద మీడియా సంస్థగా ఇపుడు రిలయన్స్‌ అవతరించింది. అనేక కంపెనీల్లో ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు ఉన్నాయి. దీంతో అదానీ కూడా మీడియాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబీఎంపీఎల్‌)లో మైనారిటీ వాటా కొనుగోలు చేసింది. అయితే ఎంత వాటా, ఎంత మొత్తానికి కొన్నారనే విషయాన్ని రెండు సంస్థలు వెల్లడించలేదు. టీవీ18 మాజీ ప్రమోటర్‌ రాఘవ్‌ బహాల్‌ ‘క్వింట్‌’ పేరుతో మీడియా సంస్థలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో క్యూబీఎంపీఎల్‌ కూడా ఒకటి. వ్యాపార, ఆర్థిక వార్తలు అందించే ఈ సంస్థ…బిజినెస్‌ న్యూస్‌ కోసం బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థతో కలిసి బ్లూమ్‌బర్గ్‌క్వింట్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ నడుపుతోంది. అదానీ గ్రూప్‌ ప్రవేశించే ముందే బ్లూమ్‌బర్గ్‌ ఈ వెంచర్‌ నుంచి తప్పుకుంది.