For Money

Business News

ఏపీలో అదానీ గ్రీన్‌ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున గ్రీన్‌ ఎనర్జి ప్రాజెక్టులు చేపట్టాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మొన్ననే ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఇవాళ ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ కోసం రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టును, 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. వీటివల్ల దాదాపు 10వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని అదానీ గ్రూప్‌ పేర్కొంది. దావోస్‌ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీల సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.