For Money

Business News

టాప్‌ 3లో గౌతమ్‌ అదానీ

చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కుబేరుల్లో టాప్‌ 3 జాబితాలో భారత్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్తకు చోటు దక్కింది. కాలేజీలోనే చదువుకు గుడ్‌ బై చెప్పిన ఆ పారిశ్రామిక వేత్త గురించి… కొన్నేళ్ళ క్రితం భారత్‌ దేశంలో కూడా ఎవరికీ పెద్దగా పరియం లేదు. అతనే అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా ర్యాంకింగ్ ప్రకారం గౌతమ్‌ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్‌ 3లో స్థానం దక్కించుకున్నారు. ముకేష్‌ అంబానీ, జాక్‌ మా కూడా ఈ స్థానాన్ని పొందలేదు. నిన్నటి షేర్ల ట్రేడింగ్‌ తరవాత అదానీ మొత్తం సంపద 13740 కోట్ల డాలర్లకు చేరింది. మన కరెన్సీ ప్రకారం ఆయన సంపద రూ. 10,99,200 కోట్లకు చేరింది. ఎలాన్ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ తరవాత అదానీదే స్థానం.